Crime news: మరో ఘోరం: మహిళను చంపి.. 50ముక్కలుగా కోసి..!
దిల్లీలోని శ్రద్ధ ఉదంతం తరహాలో ఝార్ఖండ్లో మరో ఘోరం చోటుచేసుకుంది. మహిళను 50 ముక్కలుగా కోసి చంపిన కేసులో ఆమె భర్తను పోలీసులు అరెస్టుచేశారు.
రాంచీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ(Delhi) శ్రద్ధా వాకర్(Shraddha Walkar) హత్యోదంతం మరిచిపోకముందే మరో షాకింగ్ ఘటన(Shocking incident) వెలుగుచూసింది. తన సహజీవన భాగస్వామి శ్రద్ధను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా అత్యంత కిరాతకంగా చంపి 35 ముక్కలుగా కోసి చంపగా.. తాజాగా అదే తరహా ఘోరం ఝార్ఖండ్లో చోటుచేసుకుంది. ఓ మహిళను చంపేసి దాదాపు 50కి పైగా ముక్కలుగా కోసిన ఘటనలో పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అత్యంత హేయమైన ఈ ఘటన ఝార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లా బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగుచూసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 12 శరీర భాగాలను గుర్తించిన పోలీసులు.. మిగతా భాగాల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు రుబికా పహాదిన్ (23)తో దిల్దార్ అన్సారీ (28) అనే వ్యక్తి రెండేళ్లుగా సహజీవనం చేసి ఇటీవలే ఆమెను వివాహం చేసుకున్నాడు. అయితే, ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రలోభానికి గురిచేసినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అతడికి ఇది రెండో వివాహం. మహిళను చంపిన తర్వాత అరెస్టు నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో నిందితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 6గంటల సమయంలో సంతాలీ మోమిన్ తోలా ప్రాంతంలో ఓ పాత ఇంటి వద్ద ఓ మహిళ ఛిద్రమైన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్పీ అనురంజన్ కిస్పొట్టా, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. అనంతరం జాగిలాలను రంగంలోకి దించారు. బాధితురాలు గిరిజన వర్గానికి చెందిన రుబికా పహాదిన్గా గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు. ఇంకా కొన్ని భాగాలు మిస్ అయ్యాయని.. వాటి కోసం సోదాలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆమె భర్త దిల్దార్ అన్సారీని అరెస్టు చేశామని.. మృతురాలు అతడికి రెండో భార్య అని వివరించారు. మరోవైపు, మహిళను చంపి ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసేందుకు నిందితులు ఎలక్ట్రిక్ కట్టర్లాంటి పదునైన ఆయుధాన్ని వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక అనుమానితుడిగా ఆమె భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ కిరాతక చర్యలో మరికొందరి ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు, ఈ ఘటనతో రాజకీయ దుమారం నెలకొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్ష భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. హేమంత్ సోరెన్ సారథ్యంలోని ఝార్ఖండ్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా.. చర్యలు తీసుకోవడంలేదని మండిపడుతున్నారు. ఈ ఘటనపై కఠినంగా వ్యవహరించకపోతే వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి తగిన రీతిలో సమాధానం చెబుతామని భాజపా అధికార ప్రతినిధి ప్రతుల్ సహదేవ్ హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్