Kakinada: భార్యను అతికిరాతకంగా నరికి చంపిన భర్త

కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపాడు.

Published : 29 Feb 2024 18:39 IST

కాకినాడ: కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్త అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన కాకినాడలోని జగన్నాథపురం పప్పుల మిల్లు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బందుల నూకరాజుకు 2016లో దివ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురువారం బయటికి వెళ్లివచ్చిన నూకరాజు.. భార్య దివ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని విచక్షణా రహితంగా నరికాడు. అడ్డువచ్చిన మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో దివ్య అక్కడికక్కడే మృతి చెందింది. దాడి తర్వాత నిందితుడు నూకరాజు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని