Lucknow: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు.. కాల్చి చంపిన ప్రియుడు

పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ ప్రియుడు తన ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 07 Apr 2023 19:46 IST

లఖ్‌నవూ: పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపి.. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య (Suicide)కు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttarpradesh)లోని ఘజియాబాద్‌ (Ghaziabad) జిల్లా నందిగ్రామ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బంధువులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాహుల్ చౌదరి(26) తనని పెళ్లి చేసుకోవాలంటూ ప్రియురాలు దీప్‌మాల యాదవ్(24)పై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ప్రియురాలి తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న ఆమెను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా విషం తాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే దీప్‌మాల మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దిల్లీలోని జీటీబీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాహుల్‌ కుడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా మృతురాలి బంధువులు నాలుగు గంటలపాటు రోడ్డును దిగ్బంధించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అసలు ఈ ఘటనకు దారి తీసిన అంశాలపై విచారణ జరుపుతామని డీసీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని