crime: భార్యాపిల్లలను చంపి.. మూడు రోజుల పాటు మృతదేహాలతో నిద్రించి..

ఓ వ్యక్తి  తన భార్యాపిల్లలను గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. 

Updated : 01 Apr 2024 13:04 IST

లఖ్‌నవూ: ఓ వ్యక్తి  తన భార్యాపిల్లలను గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు గౌతమ్‌ తన భార్య జ్యోతి(36), కుమార్తె(6), కుమారుడు(9)లతో లఖ్‌నవూలోని బిజ్నోర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. తన భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ తరచూ గొడవపడేవాడు.

ఈ క్రమంలో మూడు రోజుల క్రితం వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అదే రోజు రాత్రి భార్య నిద్రిస్తుండగా మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. అనంతరం పిల్లలను గొంతు నులిమి చంపేశాడు. మరుసటి రోజు ఉదయం చుట్టుపక్కల వారికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి పనికి వెళ్లాడు. అలా అదే గదిలో మూడు రోజుల పాటు మృతదేహాల పక్కనే నిద్రించి ఉదయం పనులకు వెళ్లేవాడు. గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గది తాళం పగలగొట్టి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని