UP Encounter: యూపీలో మళ్లీ ఎన్కౌంటర్.. వాంటెడ్ క్రిమినల్ హతం
యూపీలో వాంటెడ్ క్రిమినల్ను పోలీసులు మట్టుబెట్టారు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని ఈ తెల్లవారుజామున ఎన్కౌంటర్ (UP Encounter) చేశారు.
కౌశంబి: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో మరోసారి పోలీసు తుపాకీ పేలింది. డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ (Wanted Criminal) గుఫ్రాన్ను పోలీసులు (UP Police) మంగళవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ (Encounter) చేశారు. అతడి తలపై రూ.1.25లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే గుఫ్రాన్ కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతిచెందాడు.
ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన గుఫ్రాన్ పలు హత్య (Murder Case), హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రతాప్గఢ్లో ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి లూటీ చేశాడు. ఆ తర్వాత నుంచి పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే నేడు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. గుఫ్రాన్ తలపై ప్రయాగ్రాజ్ పోలీసులు రూ.లక్ష, సుల్తాన్పుర్ పోలీసులు రూ.25వేల రివార్డు ప్రకటించారు.
కాగా.. గత కొన్ని రోజులుగా ఉత్తరప్రదేశ్లో వరుస ఎన్కౌంటర్లు జరిపి నేరస్థులు, గ్యాంగ్స్టర్లను మట్టుబెడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడితో పాటు పలువురిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు 10వేలకు పైగా ఎన్కౌంటర్లు జరగ్గా.. 185 మంది క్రిమినల్స్ను మట్టుబెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.