Rajkot: గేమ్జోన్లో ఘోరం
వేసవి సెలవులు...అందులోనూ వారాంతం... సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు.
గుజరాత్లోని రాజ్కోట్ అగ్ని ప్రమాదంలో 27 మంది మృత్యువాత
మంటల ధాటికి కుప్పకూలిన పైకప్పు
చిక్కుకున్న చిన్నారులు, తల్లిదండ్రులు
అగ్నికీలల్లో రాజ్కోట్లోని గేమ్జోన్
రాజ్కోట్: వేసవి సెలవులు...అందులోనూ వారాంతం... సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు అనూహ్యంగా పెను ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్జోన్లో చెలరేగిన మంటలు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడంతో వెలుపలికి రాలేని పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయానికి 27 మృత దేహాలను సహాయ సిబ్బంది వెలికి తీశారు. అందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. ప్రాణాలు కోల్పోయిన వారిలో చిన్న పిల్లలతో పాటు వారి వెంట వచ్చిన తల్లిదండ్రులూ ఉన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని సహాయక పనులను పర్యవేక్షిస్తున్న రాజ్కోట్ కలెక్టర్ ప్రభాస్ జోషి తెలిపారు. భారీ మంటలు ఎగసినందు వల్లే టీఆర్పీ గేమ్జోన్ కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని వెల్లడించారు.
ఆ సమయంలో చిన్నారులతో పాటు పలువురు వ్యక్తులు వివిధ ఆటల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు. టీఆర్పీ గేమ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి అనే వ్యక్తిపేరు మీద ఉందని రాజ్కోట్ పోలీస్ కమిషనర్ రాజు భార్గవ్ తెలిపారు. శిథిలాల తొలగింపు చురుగ్గా జరుగుతోందన్నారు. నగరంలోని ఇతర గేమ్జోన్లను మూసివేయాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించినట్లు తెలిపారు. దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. గేమ్జోన్ యజమాని యువరాజ్ సింగ్ సోలంకి, మేనేజర్ నితిన్జైన్ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. చిన్నారులు సహా పలువురి ప్రాణాలను కబళించిన ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్తో ఫోన్లో మాట్లాడి సహాయ చర్యల గురించి ఆరా తీశారు. తన ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల గురించేనని ప్రధాని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు సీఎం భూపేంద్రభాయ్ పటేల్ ప్రకటించారు. గాయపడిన ఒక్కొకరికి రూ.50వేలు అందిస్తామన్నారు.
రాష్ట్రపతి విచారం
రాజ్కోట్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గేమ్జోన్లోని భద్రత ఏర్పాట్లపై ఆడిట్ నిర్వహించాలని ముంబయి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వర్ష గైక్వాడ్ డిమాండ్ చేశారు. చిన్నారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
Cyber fraud: అడ్వర్టైజ్మెంట్ పేరు చెప్పి ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.81 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఆ వివరాలు ఇవీ.. -
గంటల వ్యవధిలో అల్లుడు, అత్త మృతి
గంటల వ్యవధిలో గుండెపోటుతో అల్లుడు, అత్త మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలో చోటుచేసుకుంది. -
మాదాపూర్లో యువకుడి అనుమానాస్పద మృతి
నగరంలోని మాదాపూర్లో సాయి అనే యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందాడు. అయ్యప్ప సొసైటీలోని ఓ హోటల్ ఆరో అంతస్తు పైనుంచి పడి మరణించాడు. -
ఏనుగు దాడిలో వృద్ధుడి దుర్మరణం.. చిత్తూరు జిల్లాలో ఘటన
ఏనుగు దాడిలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పీయం తండాలో చోటుచేసుకుంది. కుప్పం ఎఫ్ఆర్వో జయశంకర్ వివరాల మేరకు.. తండాకు చెందిన కన్నానాయక్(65) శనివారం రాత్రి పశువులను కట్టేసేందుకు కొట్టంలోకి వెళ్లారు. -
హత్యకు దారి తీసిన ఘర్షణ
అప్పు చెల్లించే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. తాడేపల్లిగూడెం గ్రామీణ మండలం పడాల గ్రామం విజయదుర్గ ఆలయం పక్క రోడ్డులో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో కొప్పర్తి రాంబాబు -
ఫైనాన్స్ వాహనాలే లక్ష్యంగా మోసాలు
-
ఘర్షణ ఘటనలో 14 మంది అరెస్టు
గోవుల రవాణా నేపథ్యంలో శనివారం రాత్రి మెదక్లో ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఘటనను నిరసిస్తూ ఆదివారం పట్టణ బంద్కు ఓ వర్గం పిలుపునిచ్చింది. -
నాన్న.. రావా..
కుటుంబ సభ్యులంతా శుభకార్యానికి హాజరయ్యారు.. తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో కళ్లెదుట తండ్రి మృతిచెందారు.. అప్పటి వరకు సంతోషంగా గడిపిన నాన్న.. విగతజీవిగా ఉండటంతో పిల్లలిద్దరి రోదనలు మిన్నంటాయి. -
చికెన్ ఇవ్వలేదని వ్యక్తి దారుణ హత్య
చికెన్ ఇవ్వలేదని ఓ వ్యక్తిని మద్యం మత్తులో మరో వ్యక్తి బండరాయితో మోది హత్య చేసిన ఘటన హీరేహాళ్ మండలం మురడి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం
-
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
-
మరో కొత్త రకం స్కామ్.. అడ్వర్టైజ్మెంట్ పేరుతో ₹81 లక్షలకు టోకరా!
-
భాజపా జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి
-
అమెరికాను మించిన అణువేగం చైనా సొంతం..!
-
పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు: చంద్రబాబు