Fire Accident: మహారాష్ట్రలో అగ్నిప్రమాదం.. ఏడుగురి మృతి

Fire Accident: ఔరంగాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు.

Published : 03 Apr 2024 09:00 IST

ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టైలరింగ్‌ దుకాణంలో తెల్లవారుజామున 4 గంటలకు మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీస్‌ కమిషన్‌ మనోజ్ లోహియా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని