జీ-20 సమావేశం ‘సీక్రెట్ ఫైళ్లు’ పాకిస్థాన్కు.. ఆర్థిక శాఖ ఉద్యోగి నిర్వాకం
జీ-20 సమావేశానికి (G20 Meeting) సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను పాకిస్థాన్కు చేరవేశాడో వ్యక్తి. కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగి ఈ గూఢచర్యానికి పాల్పడ్డాడు.
గాజియాబాద్: విదేశాంగ శాఖ (Ministry of External Affairs)లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి గూఢచర్యాని (espionage)కి పాల్పడ్డాడు. భారత్లో జరుగుతున్న జీ-20 సమావేశానికి సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను పాకిస్థాన్కు చేరవేశాడు. అతడి నిర్వాకంపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని గాజియాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నవీన్ పాల్ అనే వ్యక్తి కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం అతడికి సామాజిక మాధ్యమాల్లో ఓ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే నవీన్ పాల్.. ఆ యువతికి దేశ భద్రతకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను పంపించాడు. జీ-20 సమావేశానికి(G20 Meeting) సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను నిందితుడు ఆ మహిళకు చేరవేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఫైళ్లను నవీన్ తన ఫోన్లో ‘సీక్రెట్’ అని సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నవీన్ కార్యకలాపాలపై నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో గాజియాబాద్ పోలీసులు మంగళవారం అతడిని అరెస్టు చేశారు. తొలుత ఆ మహిళ ఫోన్ నంబరు.. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందినదిగా గుర్తించారు. ఆ తర్వాత ఐపీ అడ్రస్తో ట్రేస్ చేయగా.. ఆ నంబరు కరాచీ నుంచి పనిచేస్తున్నట్లుగా తేలింది. అంతేగాక, రాజస్థాన్లోని అల్వార్కు చెందిన ఓ మహిళ.. నవీన్ ఖాతాకు కొంత డబ్బు జమ చేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఆ మహిళా ఎవరా?అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు డబ్బు కోసమే ఈ పని చేశాడా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?