Student Murder: సైకిల్పై వెళ్తున్న విద్యార్థిని చున్నీ లాగి.. హత్య చేసి.. చివరికి!
బాలికను హత్య చేసి.. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు.
లఖ్నవూ: ఓ స్కూలు విద్యార్థినిపై ముగ్గురు దుర్మార్గులు వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పాఠశాల నుంచి సైకిల్పై ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి చున్నీ లాగేశారు. కింద పడిపోయిన ఆమెను బైక్తో తొక్కించి హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని అంబేడ్కర్ నగర్లో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితులను గుర్తించిన పోలీసులు తాజాగా వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ల కాళ్లపై కాల్పులు జరిపి తిరిగి అదుపులోకి తీసుకున్నారు.
అంబేడ్కర్నగర్ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలిక హత్య కేసులో నిందితులు షహబాజ్, ఫైసల్తో పాటు మరో మైనర్ బాలుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఇద్దరికి కాళ్లలోకి బుల్లెట్లు దిగడంతో అక్కడే కూలిపోయారు. పరుగెత్తే క్రమంలో మైనర్ బాలుడి కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. అతడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గుర్నీ వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఎస్హెచ్వోను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.