Student Murder: సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థిని చున్నీ లాగి.. హత్య చేసి.. చివరికి!

బాలికను హత్య చేసి.. పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Published : 17 Sep 2023 15:25 IST

లఖ్‌నవూ: ఓ స్కూలు విద్యార్థినిపై ముగ్గురు దుర్మార్గులు వేధింపులకు పాల్పడ్డారు. ఆమె పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి వెళ్తుండగా వెనక నుంచి చున్నీ లాగేశారు. కింద పడిపోయిన ఆమెను బైక్‌తో తొక్కించి హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్‌ నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితులను గుర్తించిన పోలీసులు తాజాగా వారిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచేందుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు వాళ్ల కాళ్లపై కాల్పులు జరిపి తిరిగి అదుపులోకి తీసుకున్నారు.

అంబేడ్కర్‌నగర్‌ ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. బాలిక హత్య కేసులో నిందితులు షహబాజ్‌, ఫైసల్‌తో పాటు మరో మైనర్‌ బాలుడిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరు పరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఇద్దరికి కాళ్లలోకి బుల్లెట్లు దిగడంతో అక్కడే కూలిపోయారు. పరుగెత్తే క్రమంలో మైనర్‌ బాలుడి కాలికి ఫ్రాక్చర్‌ అయ్యింది. అతడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ ముగ్గుర్నీ వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన ఎస్‌హెచ్‌వోను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని