Lasya Nanditha: ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తు వేగవంతం
పటాన్చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
హైదరాబాద్: పటాన్చెరు శివారులో బాహ్యవలయ రహదారిపై కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది?అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు.
ముందు వెళ్తోన్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఓఆర్ఆర్పై రెండో లైనులో వెళ్తోన్న వాహనం చివరకు రెయిలింగ్ను ఢీకొని ఆగిపోయినట్లు గుర్తించారు. ప్రమాద స్థలం నుంచి దాదాపు 500మీటర్ల దూరంలో కారు స్పేర్పార్టు, కారుపై రాక్శాండ్ పౌడర్ పడి ఉండటంతో టిప్పర్ లేదా రెడిమిక్స్ వాహనాన్ని ఢీకొట్టి ఉంటుందని నిర్ధరణకు వచ్చారు. ప్రమాద సమయంలో ఓఆర్ఆర్పై వెళ్లిన ఆరు టిప్పర్ల వివరాలను గుర్తించారు. అయితే, ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఆకాశ్ మద్యం తాగి ఉన్నాడా? లేదా? అనే వివరాల నిర్ధరణ కోసం అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపారు. ముత్తంగి బాహ్యవలయ రహదారి దాటుతున్న సమయాలను తెలుసుకొన్నారు. ఆకాశ్ చరవాణి వివరాలు కూడా పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేజిస్ట్రేట్ ఎదుట డ్రైవర్ వాంగ్మూలం తీసుకున్నారు. హై ప్రొఫైల్ కేసుకావడంతో సంబంధిత శాఖలోని నిపుణులతో దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.