Road accident: కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి.. భర్తపై మృతురాలి తల్లిదండ్రుల అనుమానం
కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది.
ఆసుపత్రి వద్ద బాధిత బంధువుల ఆందోళన
ప్రవీణ్తో కుమారి, చిన్నారులు కృషిక, తనిష్క
రఘునాథపాలెం, న్యూస్టుడే: కారు ప్రమాదంలో తల్లి, ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండా సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాబోజితండాకు చెందిన డా.బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), కుమార్తెలు కృషిక(4), తనిష్క(3)తో కలిసి కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరారు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. అకస్మాత్తుగా అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి కారు రహదారి పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొంది. అనంతరం రహదారిపై వెళ్తున్నవారు కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే కృషిక, తనిష్క మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న కుమారిని 108 అంబులెన్సు సిబ్బంది ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే కుమారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనలో ప్రవీణ్కు స్వల్ప గాయాలవ్వడంతో అతన్ని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని రఘునాథపాలెం ఎస్ఐ సురేశ్, సిబ్బంది సందర్శించి విచారణ చేపట్టారు. మృతురాలి తండ్రి హరిసింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సంఘటన విషయం తెలిసి కుమారి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కుమారి, పిల్లల మృతిపై వారు అనుమానం వ్యక్తం చేశారు.
వివాహేతర సంబంధమే కారణం!
ప్రవీణ్ హైదరాబాదులో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు. 2017లో ఏన్కూరు మండలం రంగాపురానికి చెందిన హరిసింగ్, పద్మ దంపతుల కుమార్తె కుమారితో వివాహమైంది. వివాహం సందర్భంగా రూ.24 లక్షలు వరకట్నంగా ఇచ్చామని ఆమె తండ్రి హరిసింగ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వారికి ఇద్దరు కుమార్తెలేనని, కుమారుడు పుట్టలేదని ప్రవీణ్ అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కేరళకు చెందిన యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. దీనిపై ఏడాదిగా దంపతుల మధ్య వివాదం నడుస్తోంది. ఇటీవల ఆ యువతితో కేరళ వెళ్లిన ప్రవీణ్ 20 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చారు. పది రోజుల క్రితం కుమారి, తన పిల్లలతో హైదరాబాద్ నుంచి బాబోజితండాకు వచ్చారు. 25న వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కేక్ తెమ్మన్నా ప్రవీణ్ తేలేదని హరిసింగ్ తెలిపారు. ఈ క్రమంలో వారు చనిపోవడం, కుమారి, పిల్లల శరీరంపై ఒక్క గాయం కూడా లేకపోవడంపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వారిని అంబులెన్సులో తీసుకువస్తుంటే అతన్ని ఎందుకు వేరే వాహనంలో తరలించారని ప్రశ్నించారు.
మంత్రి తుమ్మల విచారం
రోడ్డు ప్రమాదం ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచారం వ్యక్తం చేశారు. ఈ విషయమై మండల నాయకులు, గ్రామస్థులకు ఫోన్ చేసి మాట్లాడారు. బాధిత కుటుంబానికి మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
కమలా.. మా మద్దతు మీకే
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి