Mahabubabad: పిల్లలతో సహా బావిలో దూకిన తల్లి.. ఇద్దరి మృతి

మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది.

Published : 22 Mar 2024 22:41 IST

నెల్లికుదురు: మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకింది. కుమారుడు ముఖేష్‌ (10) సురక్షితంగా బయటపడగా.. తల్లి లావణ్య (30), కుమార్తె నిత్యశ్రీ (6) మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ కలహాలతో లావణ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని