Crime News: ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య

ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది.

Updated : 18 May 2024 07:53 IST

తల్లాడ: ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. ఇద్దరు కుమార్తెలు నీరజ(10), ఝాన్సీ(6)లను చంపి పరారయ్యాడు. పొలం తన పేరుపై రాయాలని తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రెండేళ్ల  క్రితం భార్యను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని