Crime News: కాకినాడ జిల్లాలో జంట హత్యల కలకలం
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామ శివారు లక్ష్మీపురం పంట పొలాల్లో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి.
గొల్లప్రోలు: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో బుధవారం ఉదయం జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)లను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో విచక్షణారహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపైనా దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ.. ఇటీవల పోసిన శ్రీనుతో కూడా సఖ్యతగా ఉంటోందన్న అనుమానంతో నాగబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భర్తతో విభేదాల కారణంగా లోవమ్మ ఆయనకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!