Praneeth Rao case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రిమాండ్
ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ కేసులో శనివారం భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డీసీపీ తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో వెల్లడించిన వివరాల ఆధారంగా వారిపై చర్యలు తీసుకున్నారు. ఆదివారం ఉదయం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిద్దరినీ చంచల్గూడ జైలుకు తరలించారు.
భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు, ఐన్యూస్ మీడియా నిర్వాహకుడు శ్రవణ్రావు అరువెల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఈ ముగ్గురూ ఇప్పటికే దేశం దాటినట్లు వెల్లడి కావడంతో లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. శుక్రవారం రాత్రే ముగ్గురి నివాసాల్లో సోదాలు జరిపి అనంతరం విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తొలుత ఎస్ఐబీలో ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టయిన ప్రణీత్రావును విచారిస్తున్న క్రమంలో ఫోన్ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇదంతా అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు కనుసన్నల్లోనే సాగినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు ప్రణీత్రావు వాంగ్మూలంలో వెల్లడించాడు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలను లక్ష్యంగా చేసుకొని ట్యాపింగ్లకు పాల్పడినట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్న కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్పల్లిలో చోటు చేసుకుంది. -
ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతి
నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటుచేసుకుంది. ఎన్నికల విధులకు వెళ్తూ తల్లీకుమారుడు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. -
రసాయనాల మాటున కరెన్సీ కట్టలు
విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై గుట్టుగా తరలిస్తున్న రూ.7 కోట్ల డబ్బు కట్టలు రోడ్డు ప్రమాదం కారణంగా బయటపడ్డాయి. -
ఆరు ప్రాణాలు బలిగొన్న మద్యం
ఉత్తర్ప్రదేశ్లోని సీతాపూర్కు చెందిన ఓ వ్యక్తి అయిదుగురు కుటుంబసభ్యులను హతమార్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ (42) మద్యానికి బానిసై కుటుంబసభ్యులతో తరచూ గొడవ పడేవాడు. -
కుక్కల దాడిలో వృద్ధురాలి మృతి
వృద్ధురాలిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వెంకటరాజపురంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు లక్ష్మి(70) శనివారం ఉదయం బహిర్భూమికి ఊరి చివరకు వెళ్లారు. -
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరూ ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. -
రూ.2 కోట్ల విలువైన మద్యం పట్టివేత
ఎన్నికల వేళ అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.2 కోట్ల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ ఠాణాలో సీఐ నాగార్జునగౌడ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
రేవణ్న లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల అదుపులో దేవరాజ గౌడ
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి వీడియోను లీక్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో నిందితుడు, ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న భాజపా నేత దేవరాజ గౌడను చిత్రదుర్గం జిల్లా హిరియూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. -
ఇసుక లారీ ఢీ.. ఇద్దరు ప్రయాణికుల మృతి
బస్షెల్టర్లో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపై శనివారం సాయంత్రం ఇసుక లారీ దూసుకెళ్లడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు, ఐఈడీ పేలి బాలిక మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతరి, బీజాపూర్ జిల్లాల్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ మావోయిస్టు, మరో బాలిక మృతి చెందారు. దంతరి జిల్లా బైసాముండా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ
-
ఘర్షణలున్నా చైనాతో వాణిజ్యం అందుకే పెరుగుతోంది : జైశంకర్
-
పోలీసును కొట్టి చంపిన పౌరులు..పాక్ ఆక్రమిత కశ్మీర్లో అసలేం జరుగుతోంది..?
-
ఓటర్లకు పంచేందుకు తరలింపు.. ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్