Phone tapping: సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేశాం: ప్రణీత్‌రావు

సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు.

Updated : 29 May 2024 15:38 IST

హైదరాబాద్‌: సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు అంగీకరించారు. కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్‌ ఆపేయాలని ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్తవాటిని అమర్చామని పేర్కొన్నారు. ధ్వంసం చేసిన ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు వెల్లడించారు. సీడీఆర్‌, ఐడీపీఆర్‌ డేటా మొత్తం కాల్చేసినట్లు పేర్కొన్నారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేసినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు