Crime news: ప్రైవేటు బస్సు బోల్తా.. ఇద్దరు బాలికల మృతి
ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది.
కోడుమూరు పట్టణం: ఓ ప్రైవేటు బస్సు మరో వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో బోల్తాపడిన ఘటన కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 మందికిపైగా ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి ఆదోనికి బయల్దేరింది. మార్గంమధ్యలో కోడుమూరు వద్దకు చేరుకోగానే మరో వాహనాన్ని ఓవర్టెక్ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది.
ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన లక్ష్మి (13), గోవర్ధిని (8) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని, ఘటనానంతరం అతడు పరారయ్యాడని బాధితులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
వితంతురాలైన వదినను పెళ్లి చేసుకున్నాడనే కారణంతో ఓ వ్యక్తిని అతడి మిగతా సోదరులు కాల్చి చంపిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని బాగ్పత్ గ్రామంలో వెలుగు చూసింది. -
రీల్స్ మోజులో ఇద్దరు బాలురి దుర్మరణం
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి బయటకు వచ్చిన ముగ్గురు బాలురు స్కూటీపై ప్రయాణిస్తూనే సెల్ఫోన్లో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. -
ఉపాధి లేక... పూట గడవక..!
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. -
మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం
ఇన్ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
విమానాల్లో టక్కరి దొంగ
విమానాల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘరానా కేటుగాడు ఆర్జీఐఏ పోలీసులకు చిక్కాడు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల్లో వెళ్తూ ఆరు చోరీలు చేసిన అతడి నుంచి కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మరోసారి తుపాకుల మోత మోగింది. దీంతో ఆదివాసీ పల్లెల్లో భయానక వాతావరణం నెలకొంది. -
గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ
గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. -
బవారియా గ్యాంగ్ పంజా
నగరంపై ఉత్తరప్రదేశ్కు చెందిన భవారియా గ్యాంగ్ పంజా విసిరింది. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దొంగలు వరుసగా నాలుగు చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. -
కన్నకొడుకే కాలయముడు
ఆ తల్లిదండ్రుల పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు.. కనిపెంచిన వారిని కిరాతకంగా డబ్బు కోసం అంతమొందించాడు.. -
గుండె కుడివైపు ఉందని భార్యను వదిలేసిన భర్త
ఓ యువతిని పెళ్లాడిన వ్యక్తి ఆమెకు గుండె కుడి వైపు ఉందనే కారణంతో వదిలేశాడు. న్యాయపోరాటం చేయడంతో ప్రతినెలా మనోవర్తి చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.