Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం

నల్గొండ వద్ద తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు సజీవదహనమయ్యాడు.

Published : 04 Dec 2023 08:43 IST

మర్రిగూడ: నల్గొండ వద్ద తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు సజీవదహనమయ్యాడు. మర్రిగూడ బైపాస్‌ దగ్గరలో షార్ట్‌సర్క్యూట్‌తో బస్సు దగ్ధమయ్యింది. మంటలు రావడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగిపోయారు. నిద్రమత్తులో ఓ వ్యక్తి బస్సు దిగకపోవడంతో.. అతడు సజీవదహనమై మృతి చెందినట్లు గుర్తించారు. హైదరాబాద్‌ నుంచి చీరాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని