Phone tapping case: రాధాకిషన్రావు అరెస్టుపై కీలక ప్రకటన విడుదల చేసిన పోలీసులు
ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్ట్యాపింగ్లో పాల్గొన్నట్లు టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావు అంగీకరించినట్లు పోలీసులు ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావును పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుకు సంబంధించి పోలీసులు ఈరోజు మీడియాకు కీలక ప్రకటన విడుదల చేశారు.
‘‘ఫోన్ట్యాపింగ్ కేసులో టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావును గురువారం బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు పిలిచి విచారించాం. ప్రైవేటు వ్యక్తులపై నిఘా ఉంచి ఫోన్ట్యాపింగ్లో పాల్గొన్నట్లు రాధాకిషన్రావు అంగీకరించారు. రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులపై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయంగా పక్షపాతంతో కొన్ని చర్యలను చేపట్టినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా రవాణా చేస్తున్న నగదు స్వాధీనంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కేసులో ఇతర నిందితులతో కుమ్మక్కై ఫోన్ట్యాపింగ్కు సంబంధించిన సాక్ష్యాల ధ్వంసం, అదృశ్యం చేయడంలో సహకరించినట్లు రాధాకిషన్రావు అంగీకరించారు’’ అని పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం న్యాయమూర్తి ఎదుట రాధాకిషన్రావును హాజరు పరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్