Andhra news: తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.
వీడియో తీసిన నలుగురు యువకులు
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుల అరెస్టు
మండవల్లి, న్యూస్టుడే: ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. పదో తరగతి మార్కుల జాబితాను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలిక(15)ను సహచర విద్యార్థి(15) తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనను గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఫోన్లో వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా.. బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం మేరకు.. మండవల్లి మండలంలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో ఓ గ్రామానికి చెందిన బాలిక ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15న మార్కుల జాబితా తీసుకునేందుకు పాఠశాలకు వెళ్లింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా.. అప్పటికే అక్కడ మాటువేసిన సహ విద్యార్థి.. బాలికను తరగతి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సంఘటనను బాలసుబ్రహ్మణ్యం(22), చంద్రశేఖర్(22), తేజ(19), హరికృష్ణ(20) వీడియో తీశారు. అనంతరం బాలికకు వీడియో చూపి తమ కోరిక తీర్చాలంటూ బలవంతం చేశారు. తమకు డబ్బులు ఇవ్వాలంటూ బాధితురాలి తల్లిదండ్రులనూ బెదిరించారు. రూ.2 లక్షలు ఇస్తామని వారు ప్రాధేయపడినా.. వారు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేశారు. దాంతోపాటు వీడియోను వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో.. బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించారు. కైకలూరు గ్రామీణ సీఐ కృష్ణకుమార్, మండవల్లి ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అత్యాచారానికి ఒడిగట్టిన బాలుడిని అదుపులోకి తీసుకొని విజయవాడ జునైల్ హోమ్కు తరలించారు. బాధితురాలిని వేధింపులకు గురిచేసిన నలుగురు యువకులను అరెస్టు చేసి కైకలూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ.. న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కళ్లల్లో కారం కొట్టి.. కర్రలతో దాడి చేసి.. ప్రొఫెసర్పై విద్యార్థుల దుశ్చర్య
తప్పుడు పనులు చేయొద్దని వారించినందుకు కక్ష పెంచుకున్న కొందరు విద్యార్థులు ప్రొఫెసర్పై దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లో చోటుచేసుకుంది. -
అనంతలో దుండగుల దుశ్చర్య.. ఓటమి అక్కసుతో తాగునీటి ట్యాంకులో పురుగుల మందు
అనంతపురం జిల్లా కనేకల్ మండలం తుంబిగనూరు గ్రామంలో శుద్ధజల నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపి విషప్రయోగానికి పాల్పడ్డారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం
అభం శుభం ఎరుగని ఆ చిన్నారికి ఏం తెలుసు.. కొన్ని గంటల్లో ఓ కామాంధుడు వస్తాడని? అతడి దురాగతానికి దారుణంగా బలైపోతానని.. ఎప్పటిలాగే అమ్మ పక్కన ఆదమరిచి నిద్రించింది ఆ బుజ్జాయి. అర్ధరాత్రివేళ.. మానవరూపంలో ఉన్న ఓ పశువు ఆమెను ఎత్తుకెళ్లి హత్యాచారానికి ఒడిగట్టాడు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని కృత్తివెన్ను సమీపంలో శుక్రవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
అంతా చూస్తుండగానే అంతమొందించారు
భూతగాదాలు యువకుడిని బలిదీసుకున్నాయి. అందరూ చూస్తుండగానే దాయాదులు కర్రలతో మూకుమ్మడిగా దాడిచేసి, అతని ప్రాణం తీశారు. నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం చిన్నపొర్లలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియోలు శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
అటవీ అధికారులపై మూకుమ్మడి దాడి
అటవీ ప్లాంటేషన్ భూముల్లో సాగుకు సిద్ధపడుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకునేందుకు సిబ్బందితో వెళ్లిన ఎఫ్ఆర్వోపై స్థానికులు కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. -
మధ్యప్రదేశ్లో ట్రాక్టర్ బోల్తా.. ఐదుగురు భక్తుల మృతి
మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో భక్తులను తీసుకెళ్తోన్న ఓ ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. మైథనా పాలి గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీల దుర్మరణం
ఝార్ఖండ్లోని గడ్వా జిల్లాలో ఆటో-లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు కూలీలు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగర్ ఉంటారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. -
రైల్లో మంటలంటూ వదంతులు.. భయంతో దూకేసిన ముగ్గురి మృతి
తాము ప్రయాణిస్తున్న రైలులో మంటలు చెలరేగాయంటూ వచ్చిన వదంతులు నమ్మి దాన్నుంచి దూకేసిన ప్రయాణికులు ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం ఝార్ఖండ్లో చోటు చేసుకుంది. -
అదుపు తప్పి లారీ బోల్తా.. ఇద్దరు ఉద్యోగుల మృతి
లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్.. చట్టబద్ధ కమిషన్నే తప్పుపడతారా?: కేంద్ర మంత్రి బండి సంజయ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
గృహ రుణాన్ని ఆమోదించే ముందు బ్యాంకులు ఏమేం చూస్తాయ్?
-
పుణె కారు ప్రమాదం.. మైనర్కు బెయిల్ మంజూరులో లోపాలు!
-
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో వివిధ పోస్టుల భర్తీకి నిర్ణయం
-
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్