Hyderabad: యువతిపై అత్యాచారం.. ఆపై నగ్న చిత్రాలు తీసి బెదిరింపులు

యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకులు అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు.

Updated : 03 Mar 2024 21:46 IST

హైదరాబాద్‌: యువతికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకులు అంతటితో ఆగకుండా ఆమె వ్యక్తిగత ఫొటోలు సేకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న బోరబండ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి ఎల్బీనగర్‌ ఠాణాకు బదిలీ చేశారు.

బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిగ్రీ చదివే యువతి ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండేది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణవ్‌ పరిచయమయ్యాడు. ఇద్దరూ కళాశాల దగ్గర కలిసేవారు. గతేడాది యువతి చదివే కళాశాల వద్దకు వెళ్లి.. ఎల్బీనగర్‌లోని ఇంటి వద్ద డ్రాప్‌ చేస్తానని బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంటికి కాకుండా హోటల్‌కు తీసుకెళ్లి తాగునీటిలో మత్తుమందు కలిపి యువతి స్పృహ కోల్పోయాక ప్రణవ్‌, మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత కోలుకున్న యువతి భయపడి.. జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదు. రెండు నెలల క్రితం యువతి నివాసం బోరబండకు మార్చారు. అత్యాచారం విషయం ఎవరికీ చెప్పకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న నిందితులు మళ్లీ ఫోన్‌ చేశారు. ఆమె నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని, చెప్పినట్టు వినాలని బెదిరించారు. వేధింపులు ఎక్కువ కావడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పగా.. బోరబండ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని