Crime News: అల్లూరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పోతవరం వద్ద అదుపుతప్పి వ్యాన్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురి మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.

Published : 15 Jun 2023 22:42 IST

కొయ్యూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొయ్యూరు మండలం పోతవరం వారపు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా పోతవరం- మరంభీమవరం మధ్య వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మారుమల ప్రాంతం తూర్పు ఏజెన్సీకి ఆనుకొని ఉండడం, సమాచార వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రోడ్డు ప్రమాదంలో చీడికోట గ్రామానికి చెందిన కాకూరు ముత్యాలమ్మ(60), దబ్బకోట గ్రామానికి చెందిన గొల్లోరి లోయిసన్(55), సీహెచ్. వి. లంకకు చెందిన ముత్యాలమ్మ మృతిచెందారు. సుమారు ఇరవై మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సమీపంలోని గుర్తేడు పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు