Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి

ఒడిశాలోని కెంఝహార్‌ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 01 Dec 2023 11:29 IST

బాలిజోడి: ఒడిశాలోని కెంఝహార్‌ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాలిజోడి వద్ద రోడ్డు పక్కన ఆగివున్న లారీని జీపు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బాధితులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని