Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

గుర్తుతెలియని వాహనం బైక్‌ను ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన డోన్‌లోని ఉంగరానిగుండ్ల వద్ద చోటుచేసుకుంది.  

Updated : 25 May 2024 01:11 IST

డోన్ నేర విభాగం: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఉంగరానిగుండ్ల వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జోరు వర్షంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముగ్గురు యువకులని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో ముని, ప్రభాకర్, దశరథ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముని, ప్రభాకర్‌లు తుగ్గలి మండలం లింగనేని దొడ్డి గ్రామానికి చెందిన వారుగా, దశరథ డోన్ మండలం చనుగొండ్ల వాసిగా పోలీసులు గుర్తించారు. మృతులు పెయింటింగ్‌ పని నిమిత్తం డోన్‌కు వచ్చి తిరిగి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని