Hyderabad: ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి

ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన ఆమనగల్లు మండలం రామ్‌నుంతల శివారులో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.

Updated : 24 May 2024 10:45 IST

రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన ఆమనగల్లు మండలం రామ్‌నుంతల శివారులో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (35), మేఘావత్ నిఖిల్ (26), బుర్ర మణిదీప్ (25)గా గుర్తించారు. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. పోలీసులు వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను జేసీబీతో వెలికితీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని