Mahabubabad: కారు- ఆటో ఢీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

మహబూబాబాద్‌ జిల్లాలో కారు-ఆటో ఢీకొని నలుగురు మృతిచెందారు. 

Updated : 15 Jan 2024 00:18 IST

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలోని 365వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. గూడూరు మండలం చిన్న ఎల్లాపూర్‌ శివారులోని ఆముతండాకు చెందిన ఇస్లావత్‌ శ్రీను(35), తల్లి పాప(70), పిల్లలు రుత్విక్‌(6), రుత్విక(4), వదిన శాంతి ఆటోలో శనివారం సూర్యాపేట జిల్లా మిర్యాలపేటలోని గిరిజన ఆలయానికి వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. జమాండ్లపల్లి శివారులోని అర్బన్‌ పార్క్‌ సమీపానికి ఆటో రాగానే కొత్తగూడ మండలం గుజేండు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇస్లావత్‌ శ్రీను, తల్లి పాప, పిల్లలు రుత్విక్‌, రుత్విక మృతి చెందగా, ఆటో డ్రైవర్‌ సర్దార్‌, వదిన శాంతి గాయపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని