Road Accident: నిర్మల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాణాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
బోల్తా పడిన బస్సు
సారంగాపూర్, నిర్మల్, న్యూస్టుడే: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం రాణాపూర్ వద్ద బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో సుమారు 50 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకుని ఆక్కడికి చేరుకున్న సారంగాపూర్ పెట్రోకార్ పోలీస్ సిబ్బంది కానిస్టేబుల్ మనోజ్, రాణాపూర్ గ్రామస్థులు క్షతగాత్రులను 108 వాహనాల్లో నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 20 మంది వరకు క్షతగాత్రులు అయ్యారు. వారికి చికిత్స అందిస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్ అజాగ్రత్తగా నడిపారని క్షతగాత్రులు చెప్పారు. బస్సు బోల్తాపడగానే డ్రైవర్ అక్కడి నుంచే పరారు అయినట్లు తెలిసింది.
ఫర్హాన బేగంను చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తున్న దృశ్యం
మహిళ పరిస్థితి విషమం: క్షతగాత్రుల్లో ఫర్హాన బేగం (25) అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ఆసుపత్రి వైద్యుల సూచనలతో ఆమెను అంబులెన్స్లో హైదరాబాద్ తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.