Tirupati: తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి..14 మందికి గాయాలు

తిరుపతి జిల్లాలో రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. 14 మందికి గాయాలయ్యాయి.

Updated : 27 Nov 2023 22:33 IST

డక్కిలి: తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెలికల్లు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, 14 మందికి గాయాలయ్యాయి. కూలీలతో వెళ్తున్న ఆటోను మరో ఆటో ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రాపూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు