Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి.. 15మందికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మంది గాయపడ్డారు. పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు ఓ కుటుంబం వ్యాన్‌లో వెళ్తుండగా..ఎదురుగా ట్రక్కు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated : 07 May 2023 22:08 IST

మోరదాబాద్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttar Pradesh) మొరదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దల్‌పట్‌పుర్‌-కోషిపుర్‌ జాతీయ రహదారిపై ఖైరక్‌హతా సమీపంలో వ్యాను-ట్రక్కు ఢీ కొన్న ఘటనలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఓ కుటుంబం ఆదివారం మధ్యాహ్నం ఓ పికప్‌ వ్యాన్‌లో వెళ్తోంది. ఖైరక్‌హతా సమీపంలోకి రాగానే ఎదురుగా వేగంగా వచ్చిన ట్రక్కు వారి వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, వ్యాను పై నుంచి ట్రక్కు వెళ్లడంతో చాలా మంది అందులో ఇరుక్కుపోయారని, అతికష్టం మీద బయటకు తీయాల్సి వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను బయటకితీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని