Road Accident: ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు.
చంద్రగిరి: ఆంధ్రప్రదేశ్లో వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, ఆయన భార్య జయంతి, వారి బంధువు పద్మమ్మతోపాటు కారు డ్రైవర్ సమీర్ మృతి చెందారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చోటుచేసుకున్న మరో ఘటనలో నలుగురు మృతి చెందారు. చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని అవతలి వైపు వెళ్తున్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను స్వామినాథన్ (35), రాకేశ్ (12), రాధా ప్రియా (14), గోపి(31)గా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరొకరిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో కారు దగ్ధం..
చంద్రగిరి మండల పరిధిలోని సి.మల్లవరం జాతీయ రహదారిపై మరో ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని అవతలి వైపు రోడ్డుకు దూసుకెళ్లింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ఇద్దరు ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి నుంచి చంద్రగిరి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
చంద్రబాబు దిగ్భ్రాంతి..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..