Road accidents: అతివేగం.. రహదారులు రక్తసిక్తం
రాష్ట్రంలో జాతీయ రహదారులు రక్తమోడాయి. అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
కృష్ణాజిల్లా కోడూరుపాడు వద్ద జరిగిన ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు.. చెల్లాచెదురైన మృతదేహాలు
హనుమాన్జంక్షన్, చంద్రగిరి, న్యూస్టుడే : రాష్ట్రంలో జాతీయ రహదారులు రక్తమోడాయి. అతివేగం నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. చెన్నై-కోల్కతా జాతీయ రహదారిపై కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా కుద్దంకు చెందిన కొండమనైకర్ సామినాథన్(43) కుటుంబం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు అడ్వకేట్ కాలనీలో నివసిస్తోంది. తమిళనాడు వెళ్లేందుకు తెల్లవారుజామున సామినాథన్, ఆయన భార్య సత్య, కుమార్తె రథిప్రియ(14), కుమారుడు రాకేష్(12), సామినాథన్ అన్న కుమారుడు గోపినాథ్ కనివేల్(32) కారులో బయలుదేరారు. వీరి కారు ఉదయం 6.40 గంటల సమయంలో కోడూరుపాడు వద్ద హైవే వంతెన దిగి పెట్రోల్ బంకును దాటింది. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో అదే లారీ కారును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని అవతలివైపు దూసుకుపోయింది. అదే సమయంలో అటు వైపు మార్గంలో మంగళగిరి నుంచి విశాఖపట్నం వెళుతున్న శీతల పానీయాల ట్రాలీని ఢీకొట్టింది. సామినాథన్ భార్య సత్య మినహా అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు ఇంజిన్ భాగం ఊడిపోయింది. తీవ్రంగా గాయపడిన సత్యను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను చిలకలూరిపేటలో సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
చంద్రగిరి మండలంలో జరిగిన ప్రమాదంలో మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరు మండలం నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీ ఆసుపత్రికి కారులో ఆదివారం అర్ధరాత్రి బయలుదేరారు. ఎం.కొంగరవారిపల్లి వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొంది. అందులో వాహనం ఇరుక్కుపోయి నుజ్జు అయింది. బలమైన గాయాలు కావడంతో శేషయ్య (46), ఆయన భార్య జయంతి(38), అత్త పద్మమ్మ (55)తోపాటు కారు డ్రైవరు షమీర్ (30) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న శేషయ్య తమ్ముడు శ్రీనివాసులు, అతడి భార్య నీరజ తీవ్రగాయాలకు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కారును, అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో అతికష్టం మీద బయటకు తీశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొన్న కారు
దగ్ధమైన కారు: ఇదే జాతీయ రహదారిలో సి.మల్లవరం సమీపంలో సోమవారం ఉదయం జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది. అదుపుతప్పి కల్వర్టుపైకి దూసుకెళ్లడంతో కారులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న తిరుపతి గ్రామీణ మండలం ఉప్పరపల్లికి చెందిన చరణ్, కల్యాణ్ గాయాలతో బయటపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి