Crime news: జోగిపేటలో దారుణం.. బాలుడిని చంపి ఉరేసుకున్న రౌడీ షీటర్‌

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. 

Published : 21 Apr 2024 16:16 IST

జోగిపేట: సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణం జరిగింది. ఓ బాలుడిని చంపిన రౌడీషీటర్‌ సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు కేబుల్‌ వైర్లు చోరీ చేశాడు. దొంగతనం విషయం చెప్పాడని శేఖర్‌ (13) అనే బాలుడిపై కక్ష పెంచుకున్నాడు. శనివారం రాత్రి మాట్లాడాలని చెప్పి బాలుడిని తీసుకెళ్లి చంపేశాడు. మృతదేహం కనిపించకుండా బావిలో పడేశారు. డబ్బులు అడిగితే ఇవ్వలేదని నిన్న రాత్రి ఓ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. 

దీంతో రౌడీషీటర్‌ నాగరాజును అరెస్టు చేసేందుకు ఆదివారం ఉదయం పోలీసులు గ్రామానికి వెళ్లగా.. భయపడి సెల్‌టవర్‌ ఎక్కాడు. చోరీ విషయంలో తన పేరు చెప్పినందుకు బాలుడిని చంపేసి బావిలో పడేసినట్టు చెప్పాడు. పోలీసులు బావిలో నుంచి బాలుడి మృత దేహాన్ని బయటకు తీశారు. బాలుడి బంధువులు పెద్ద ఎత్తున సెల్‌టవర్‌ వద్దకు చేరుకోవడంతో దాడి చేస్తారేమోనని భయపడి సెల్‌ టవర్‌ వైర్లతో అక్కడే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నాయి. వ్యాపారులు, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని