Crime News: పుట్టిన వెంటనే పిల్లల్ని చంపి.. ఏళ్ల పాటు ఫ్రిజ్లోనే పెట్టి..!
చిన్నారులపై కన్న ప్రేమ చూపాల్పిన ఓ తల్లి తనకు పుట్టిన బిడ్డలను తానే చంపింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను ఏళ్ల పాటు ఫ్రిజ్లో భద్రపరిచిన విషయం ఇటీవల వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. తనకు పుట్టిన బిడ్డలను తానే చంపడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా వారి మృతదేహాలను ఫ్రిజ్లో భద్రపరిచింది. రోజులు కాదు.. నెలలు కాదు.. కొన్నేళ్ల పాటు ఇలా ఫ్రీజర్లో ఉంచడం గమనార్హం. ఈ వ్యవహారం దక్షిణ కొరియాలో ఇటీవల వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. వారెంటు తీసుకొని ఆమెను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.
దక్షిణ కొరియాలోని సువాన్ నగరానికి చెందిన ఓ మహిళకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరి వయసు 8 నుంచి 12 ఏళ్ల మధ్య ఉంది. వీరు కాకుండా 2018లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. పుట్టిన మరుసటి రోజే ఆ బిడ్డను చంపి ఇంట్లోని ఫ్రిజ్లో పెట్టింది. తర్వాత 2019 నవంబర్లో మరో పాప పుట్టగా.. ఇదే దారుణానికి ఒడిగట్టింది. ఆస్పత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నప్పటికీ పుట్టిన తర్వాత పిల్లల పేర్లు ఎక్కడ నమోదు చేయకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆ ఏడాది మేలో అధికారులు ఆరా తీయగా ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. తొలుత పోలీసుల దర్యాప్తునకు ఆమె సహకరించలేదు. దీంతో సెర్చ్ వారెంట్ తీసుకొని వచ్చి ఆమె ఇంట్లో సోదాలు జరిపారు. ఆ క్రమంలోనే ఫ్రిజ్లో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. ఆ హత్యలు తానే చేసినట్లు అంగీకరించింది. పిల్లల్ని పోషించే ఆర్థిక స్థితి లేకపోవడంతోనే అలా ప్రాణాలు తీసినట్లు తెలిపింది. తన భార్య అబార్షన్ చేయించుకున్నట్లు చెప్పిందని.. అందుకే ఈ దారుణం గురించి తనకు తెలియదని భర్త పోలీసులకు చెప్పడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
ఏజెంట్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి..ఉద్యోగాల పేరుతో యువకులను మభ్యపెట్టి కంబోడియాకు తరలిస్తున్న ముఠా గుట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆ ముఠా సభ్యుడు కంచర్ల సాయి ప్రసాద్ను అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నాయకుడి హత్య
ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. -
ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం
మల్టీజోన్-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
డ్రగ్స్ తయారీ మాఫియా గుట్టురట్టు
గుజరాత్, రాజస్థాన్లలో మాదక ద్రవ్యాల తయారీ ముఠా గుట్టు రట్టయింది. రహస్యంగా నడుపుతున్న డ్రగ్స్ ల్యాబ్లపై మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్సీబీ), గుజరాత్కు చెందిన ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) దాడులు నిర్వహించి 13 మందిని అరెస్టు చేశాయి. -
ఝార్ఖండ్లో స్కూల్ బస్సు బోల్తా.. 15 మంది చిన్నారులకు గాయాలు
ఝార్ఖండ్లోని రాంచీలో చిన్నారులతో పాఠశాలకు వెళుతున్న ఓ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్