AP News: ఏపీలో నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

Updated : 24 Nov 2023 19:06 IST

తిరుపతి: ఏపీలోని తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.

కారును ఢీకొన్న కళాశాల బస్సు..

తిరుపతి జిల్లా నారాయణవనం బైపాస్‌ వద్ద కాలేజీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారులో ఉన్న మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. మృతులు పుత్తూరు మండలం పరమేశ్వరమంగలముకు చెందిన రమేష్‌ నాయుడు , పుష్ప, భాను, వనజాక్షమ్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన శివమ్మను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పరమేశ్వరమంగలముకు చెందిన వీరంతా కారులో చెన్నైలోని పెరంబూరులో బంధువుల నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా.. పుత్తూరు శ్రీవిద్య కళాశాలకు చెందిన బస్సు ఢీకొంది.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లా కావలి మండలం మద్దూరుపాడు వద్ద  జాతీయ రహదారిపై ఆగివున్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారికి కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కారు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు విజయవాడ భవానీపురం వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు