Crime News: ఆస్ట్రేలియాలో షాద్నగర్ వాసి అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం సముద్రంలో లభ్యమైంది.
అదృశ్యమైన 5 రోజులకు సముద్రంలో మృతదేహం లభ్యం
అరవింద్
షాద్నగర్, న్యూస్టుడే: రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆయన మృతదేహం సముద్రంలో లభ్యమైంది. షాద్నగర్ పట్టణానికి చెందిన దివంగత భాజపా నాయకుడు అరటి కృష్ణ, ఉషారాణి దంపతుల కుమారుడు అరవింద్(30) ఐదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి సిడ్నీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డారు. ఏడాదిన్నర క్రితమే కేశంపేట మండలం చింతకొండపల్లికి చెందిన సిరివెన్నెలతో వివాహమైంది. కుమారుడి వద్దకు రెండు నెలల క్రితం వెళ్లిన తల్లి ఉషారాణి సోమవారమే స్వదేశానికి తిరిగివచ్చారు. అదే రోజున అరవింద్ అదృశ్యమయ్యారు. దీనిపై భార్య అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అరవింద్ మృతదేహాన్ని పోలీసులు సముద్రంలో కనుగొన్నారు. ఇది ప్రమాదమా, హత్యా, ఆత్మహత్యా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. 2006లో భర్త దూరం కాగా కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు కన్నుమూయడంతో ఉషారాణి కన్నీరుమున్నీరవుతున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు స్థానిక భాజపా నేత పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి సహకారంతో కేంద్రమంత్రి కిషన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆయన విదేశీ వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి