Shraddha Murder: శ్రద్ధా నన్ను వదిలేస్తానని బెదిరించింది.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్..!
శ్రద్ధా తనకు బ్రేకప్ చెప్పడం ఆఫ్తాబ్ సహించలేకపోయాడు. తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు నార్కో పరీక్షలో వెల్లడించాడు.
దిల్లీ: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆఫ్తాబ్ వెల్లడించినట్లు సమాచారం. శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని నిందితుడు వైద్యులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
బ్రేకప్ చెప్తానని అన్నందుకే..
ఆఫ్తాబ్, శ్రద్ధా బంధంలో విభేదాలు తలెత్తాయి. తరచూ వేధించడం, శారీరకంగా హింసించడంతో విసుగెత్తిన శ్రద్ధా.. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయమై మే 3, 4 తేదీల్లో వీరి మధ్య చర్చ జరిగింది కూడా. అయితే తనను రిజెక్ట్ చేయడాన్ని ఆఫ్తాబ్ సహించలేకపోయాడు. తనకు బ్రేకప్ చెప్పి శ్రద్ధా మరొకరితో వెళ్లిపోతుందేమోనని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అటు ఇంటి ఖర్చులు, పెళ్లి విషయంలో తరచూ గొడవలు జరిగేవి. మే 18న కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఇక తనతో కలిసి ఉండేది లేదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతానని శ్రద్ధా బెదిరించింది. దీంతో ఆవేశానికి గురై ఆమెను గొంతు నులిమి చంపేశానని ఆఫ్తాబ్ నార్కో పరీక్షలో వెల్లడించినట్లు సమాచారం. అయితే క్షణికావేశంలోనే శ్రద్ధాను చంపానని ఆఫ్తాబ్ చెబుతున్నప్పటికీ.. పక్కా ప్లాన్తోనే ఈ హత్యకు నిందితుడు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
20-25 ప్రశ్నలు.. వచ్చే వారానికి శ్రద్ధ డీఎన్ఏ నివేదిక!
దిల్లీలోని రోహిణి ప్రాంతంలో గల ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఆఫ్తాబ్కు నార్కో పరీక్ష నిర్వహించారు. ఇందులో అతడిని కేసు గురించి సాధారణమైన 20-25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వీటన్నింటికీ ఆఫ్తాబ్ సమాధామిచ్చాడట. తన సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala)కు పోలీసులు పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలు నిర్వహించగా ఈ రెండు టెస్ట్ల్లోనూ అతడు చెప్పిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. 14 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దర్యాప్తులో ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో.. పాలీగ్రాఫ్, నార్కో టెస్ట్ల్లోనూ అదేరకంగా స్పందించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు టెస్ట్ల్లోనూ పోలీసులకు పూర్తిగా సహకరించాడని, పోలీసుల దర్యాప్తులో చెప్పిన సమాధానాలే ఈ పరీక్షలప్పుడు కూడా చెప్పాడని పేర్కొంటున్నారు. శ్రద్ధను తానే చంపి ఆమె శరీర భాగాలను దిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరేసినట్టు అంగీకరించాడన్నారు. అయితే, ఇప్పటికే కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమె పుర్రెను ఇంకా గుర్తించాల్సి ఉంది. శ్రద్ధ డీఎన్ఏ నివేదిక వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడు శ్రద్ధను చంపాడని నిరూపించడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. అయినా ఇంకా డిజిటల్ ఫుట్ప్రింట్స్, సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామన్నారు. ఇవి దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
తిహాడ్ జైలుకు ఫోరెన్సిక్ బృందం
మరోవైపు.. శుక్రవారం ఉదయం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం తిహాడ్ జైలుకు వెళ్లింది. నార్కో పరీక్ష తర్వాత దర్యాప్తు అధికారి ఆఫ్తాబ్ను మరోసారి విచారించారు. ఈ పరీక్షలో చెప్పిన సమాధానాలను కూడా నిందితుడికి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అనుచరుడి వద్ద భారీగా మద్యం స్వాధీనం చేసుకున్న ఘటన మరువక ముందే తాజాగా పొదలకూరు మండలం విరువూరులో మరో అనుచరుడు చిర్రా రాజగోపాల్రెడ్డి రైస్మిల్లులో మద్యం నిల్వలను బుధవారం సెబ్, పోలీసు అధికారులు సీజ్ చేశారు. -
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. -
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. -
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సు బోల్తా
లక్షలాది కి.మీ. తిరిగిన బస్సులను స్క్రాబ్కు పంపకుండా రోడ్లపైకి పంపడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినట్లే. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం.. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. -
పల్నాడులో తెదేపా కార్యకర్తలపై.. వైకాపా వర్గీయుల దాడి
`పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనుమెళ్లలో వైకాపా వర్గీయుల దాడిలో తెదేపాకు చెందిన నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. -
గుంతలో పడి.. ఏకే 47 పేలి.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూసుగుప్పలోని 81 బెటాలియన్ బేస్ క్యాంపు పరిధిలో బుధవారం ఏకే-47 తుపాకి ప్రమాదవశాత్తు పేలడంతో విధుల్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ ఎంవీ శేషగిరి(47) మృతి చెందారు. -
ఇంటర్లో ఫెయిలైన ఏడుగురు విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపంతో రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు బుధవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ