Shraddha Murder: శ్రద్ధా నన్ను వదిలేస్తానని బెదిరించింది.. నార్కో పరీక్షలో ఆఫ్తాబ్..!
శ్రద్ధా తనకు బ్రేకప్ చెప్పడం ఆఫ్తాబ్ సహించలేకపోయాడు. తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించడంతోనే ఆమెను హత్య చేశానని నిందితుడు నార్కో పరీక్షలో వెల్లడించాడు.
దిల్లీ: సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాకు గురువారం నార్కో పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆఫ్తాబ్ వెల్లడించినట్లు సమాచారం. శ్రద్ధా తనను వదిలి వెళ్లిపోతానని బెదిరించిందని, అందుకే ఆమెను చంపేశానని నిందితుడు వైద్యులకు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
బ్రేకప్ చెప్తానని అన్నందుకే..
ఆఫ్తాబ్, శ్రద్ధా బంధంలో విభేదాలు తలెత్తాయి. తరచూ వేధించడం, శారీరకంగా హింసించడంతో విసుగెత్తిన శ్రద్ధా.. అతడి నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయమై మే 3, 4 తేదీల్లో వీరి మధ్య చర్చ జరిగింది కూడా. అయితే తనను రిజెక్ట్ చేయడాన్ని ఆఫ్తాబ్ సహించలేకపోయాడు. తనకు బ్రేకప్ చెప్పి శ్రద్ధా మరొకరితో వెళ్లిపోతుందేమోనని ఆమెపై కోపం పెంచుకున్నాడు. అటు ఇంటి ఖర్చులు, పెళ్లి విషయంలో తరచూ గొడవలు జరిగేవి. మే 18న కూడా వీరి మధ్య గొడవ జరిగింది. ఇక తనతో కలిసి ఉండేది లేదని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతానని శ్రద్ధా బెదిరించింది. దీంతో ఆవేశానికి గురై ఆమెను గొంతు నులిమి చంపేశానని ఆఫ్తాబ్ నార్కో పరీక్షలో వెల్లడించినట్లు సమాచారం. అయితే క్షణికావేశంలోనే శ్రద్ధాను చంపానని ఆఫ్తాబ్ చెబుతున్నప్పటికీ.. పక్కా ప్లాన్తోనే ఈ హత్యకు నిందితుడు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
20-25 ప్రశ్నలు.. వచ్చే వారానికి శ్రద్ధ డీఎన్ఏ నివేదిక!
దిల్లీలోని రోహిణి ప్రాంతంలో గల ఆసుపత్రిలో రెండు గంటల పాటు ఆఫ్తాబ్కు నార్కో పరీక్ష నిర్వహించారు. ఇందులో అతడిని కేసు గురించి సాధారణమైన 20-25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. వీటన్నింటికీ ఆఫ్తాబ్ సమాధామిచ్చాడట. తన సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అఫ్తాబ్ పూనావాలా(Aaftab Poonawala)కు పోలీసులు పాలీగ్రాఫ్, నార్కో పరీక్షలు నిర్వహించగా ఈ రెండు టెస్ట్ల్లోనూ అతడు చెప్పిన సమాధానాలు ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. 14 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు దర్యాప్తులో ఎలాంటి సమాధానాలు ఇచ్చాడో.. పాలీగ్రాఫ్, నార్కో టెస్ట్ల్లోనూ అదేరకంగా స్పందించినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు టెస్ట్ల్లోనూ పోలీసులకు పూర్తిగా సహకరించాడని, పోలీసుల దర్యాప్తులో చెప్పిన సమాధానాలే ఈ పరీక్షలప్పుడు కూడా చెప్పాడని పేర్కొంటున్నారు. శ్రద్ధను తానే చంపి ఆమె శరీర భాగాలను దిల్లీలోని అటవీ ప్రాంతంలో విసిరేసినట్టు అంగీకరించాడన్నారు. అయితే, ఇప్పటికే కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఆమె పుర్రెను ఇంకా గుర్తించాల్సి ఉంది. శ్రద్ధ డీఎన్ఏ నివేదిక వచ్చే వారంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అతడు శ్రద్ధను చంపాడని నిరూపించడానికి తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని.. అయినా ఇంకా డిజిటల్ ఫుట్ప్రింట్స్, సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామన్నారు. ఇవి దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
తిహాడ్ జైలుకు ఫోరెన్సిక్ బృందం
మరోవైపు.. శుక్రవారం ఉదయం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ బృందం తిహాడ్ జైలుకు వెళ్లింది. నార్కో పరీక్ష తర్వాత దర్యాప్తు అధికారి ఆఫ్తాబ్ను మరోసారి విచారించారు. ఈ పరీక్షలో చెప్పిన సమాధానాలను కూడా నిందితుడికి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ