MP Prabhakarreddy: సంచలనం కోసమే ఎంపీ ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి: సీపీ శ్వేత
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ మీడియాకు వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు .. ఎంపీపై దాడి చేశారని తెలిపారు.
సిద్దిపేట: మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా దుబ్బాక భారాస అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన దాడి కేసు వివరాలను సిద్దిపేట సీపీ మీడియాకు వెల్లడించారు. సంచలనం కోసమే నిందితుడు రాజు .. ఎంపీపై దాడి చేశారని తెలిపారు. ‘‘నిందితుడికి ఎవరి సహకారం లేదు. రాజు ఒక్కడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వారం క్రితం కత్తికొనుగోలు చేసి ఎంపీ హత్యకు పథకం రచించాడు. నిందితుడు రాజు పలు వెబ్ఛాన్సల్లో పనిచేస్తున్నాడని తెలిసింది. విలేఖరి అని చెప్పుకొంటూ, ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసి జల్సాలకు వాడుకునే వాడు.
వీటికి సంబంధించి రాజుపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఎంపీపై దాడి సమయంలో భారాస కార్యకర్తలు అతనిపై దాడి చేశారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత రాజును తొగుట సీఐ కమలాకర్ అదుపులోకి తీసుకుని విచారించారు. ఏదైనా సంచలన ఘటన చేసి అందరి దృష్టిలో పడాలనే కత్తితో దాడి చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. గన్మెన్ ప్రభాకర్ నుంచి కత్తి, పాస్టర్ అంజయ్య వద్ద నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. కేసు విచారణలో భాగంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం నిందితుడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సోషల్ మీడియాలో ఎవరూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టొద్దు’’ అని సీపీ సూచించారు.
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై దుండగుడు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలవరం రేపింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ప్రభాకర్రెడ్డి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గాజులపల్లి, దొమ్మాట, ముత్యంపేటలో ప్రచారం ముగించుకొని సూరంపల్లికి వెళ్లారు. అక్కడ పాస్టర్ అంజయ్యను పరామర్శించారు. తిరిగి బయలుదేరేందుకు కారు వద్దకు రాగా.. ఆయనతో కొందరు స్థానికులు సెల్ఫీలు దిగారు. అదే సమయంలో మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాలకు చెందిన గట్టని రాజు(38) ఎంపీతో కరచాలనం చేసేందుకు వచ్చినట్లు వెనుక నుంచి చేయి చాపుతూ ఆకస్మాత్తుగా తన జేబులో నుంచి కత్తి తీసి.. ఎంపీ కుడివైపు పొట్టలో పొడిచాడు. ఎంపీ వెంట ఉన్న గన్మెన్ ప్రభాకర్ వెంటనే తేరుకొని రాజును పట్టుకుని కత్తిని లాగేసుకోగా.. చుట్టూ ఉన్న భారాస నాయకులు, కార్యకర్తలు అతన్ని కొట్టారు. ఎంపీని కార్యకర్తలు కారులో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు కుట్లు వేశారు. వారి సూచనల మేరకు ప్రభాకర్రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొత్త ప్రభాకర్రెడ్డి పొట్టలో కత్తితో పొడవడంతో చిన్న పేగుకు తీవ్ర గాయమైందని, పొట్టలోనే తీవ్ర రక్తస్రావమైందని యశోద వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాకర్రెడ్డి యశోద ఆసుపత్రికిలో చికిత్స పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. -
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
హరియాణా నూహ్లోని కేఎంపీ ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. -
ఈ నెల 27న వివాహం.. పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య
ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకుంది. -
బెంబేలెత్తిస్తున్న ‘ఎస్బీఐ’ సందేశం
స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు పెరిగాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, లాటరీ తగిలిందనో, తక్కువ ధరలో బ్రాండెడ్ వస్తువులనో.. ఏదో ఒక సందేశం పంపి నకిలీ లింకులు చేరవేస్తూ ఆకర్షితులైనవారి ఖాతా నుంచి డబ్బులు ఖాళీ చేస్తున్నారు. -
గూఢచర్యం కేసులో ప్రధాన నిందితుడి గుర్తింపు
సైనిక స్థావరాలకు సంబంధించిన గూఢచర్యం కేసులో మరో నిందితుడిని గుర్తించి అనుబంధ ఛార్జిషీట్లో చేర్చినట్లు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. -
పనికి వెళుతూ.. ప్రాణాలొదిలారు
ఉపాధి కోసం హైదరాబాద్కు వెళుతున్న భార్యాభర్తలు, వీరి కుమారుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగింది. -
ఉన్నట్టుండి పెరిగిన జలపాతం.. బాలుడి మృతి
కుట్రాలం జలపాతంలో ఆకస్మికంగా వరద రావడంతో ఓ బాలుడు కొట్టుకుపోయి మృతి చెందాడు. -
మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్
ఆర్కిటెక్ట్ అయిన మహిళకు రాత్రి వేళ ఫోన్ చేసిన దుండగుడు మాయమాటలతో బెదిరించాడు. అనంతరం వీడియో కాల్ చేసి ఉదయం వరకు పోలీసు కేసుల పేరుతో భయపెడుతూనే ఉన్నాడు. -
విమానాశ్రయంలో వైద్యుడి అరెస్టు
గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ లోకేశ్కుమార్ శుక్రవారం రాత్రి విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
సీశామ్ కలవరం!
‘‘ హైదరాబాద్లో ఓ వ్యక్తి ఫేస్బుక్ ఖాతా ద్వారా మైనర్ల అశ్లీల వీడియో(ఛైల్డ్ సెక్సువల్ అబ్యూజివ్ మెటీరియల్- సీశామ్) షేర్ అయ్యింది. -
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలోని ఎస్టీపీపీలో ఓ ఇంజినీరు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తోటి ఉద్యోగులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గోదావరిఖనికి చెందిన బూరుగడ్డ కిరీటి(37) ఎస్టీపీపీలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజినీరు(డీవైఎస్ఈ)గా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్ఎం)లో విధులు నిర్వర్తిస్తున్నారు. -
పోలీసులు కొట్టారని ఆటోడ్రైవర్ ఆత్మహత్య
నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పోలీసులు కొట్టారని మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్