Telangana News: దిల్లీ నుంచి డబ్బులు తెచ్చారా?.. నందకుమార్ హోటల్లో సిట్ సోదాలు
తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. నందకుమార్కు చెందిన ఫిలింనగర్లోని దక్కన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఇటీవలే ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, సోమయాజి, నందకుమార్ ను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. విచారణ సందర్భంగా నిందితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఇవాళ సాయంత్రం సిట్ అధికారులు.. నందకుమార్కు చెందిన ఫిలింనగర్లోని దక్కన్ హోటల్లో తనిఖీలు నిర్వహించారు. రామచంద్రభారతి, సింహయాజి ఇదే హోటల్లో బస చేసినట్టు గుర్తించారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సేకరిస్తున్నట్టు సమాచారం.
హోటల్కు నిందితులు ఎప్పుడు వచ్చారు? వారితో ఎవరెవరు వచ్చారు? ఎన్ని రోజులు బస చేశారు? అనే కోణంలో సిట్ అధికారులు దృష్టిసారించారు. ప్రధాన నిందితుడు రామచంద్రభారతి గత నెల 26న దిల్లీ నుంచి విమానంలో వచ్చినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. రామచంద్రభారతితో పాటు దిల్లీ నుంచి ఇంకా ఎవరైనా వచ్చారా? అని ఆరా తీస్తున్నారు. పైలట్ రోహిత్రెడ్డికి రూ.100 కోట్లు, మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50కోట్ల చొప్పున ఇస్తామని రామచంద్రభారతి చెప్పినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దిల్లీ నుంచి డబ్బులు తెచ్చారా? రామచంద్రభారతితో పాటు వచ్చిన వ్యక్తులు హోటల్లో బస చేశారా? అనే వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్ బృందం దర్యాప్తు మొత్తం రామచంద్రభారతి కేంద్రంగానే కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం