AFTC: ట్రైనీ క్యాడెట్ మృతి.. ఆరుగురు ఏయిర్ఫోర్స్ అధికారులపై హత్యాకేసు!
ఓ భారత వాయుసేన(IAF) ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్ఫోర్స్ అధికారులపై హత్యాకేసు నమోదైంది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ(AFTC)లో ఈ ఘటన చోటుచేసుకుంది...
బెంగళూరు: ఓ భారత వాయుసేన(IAF) ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్ఫోర్స్ అధికారులపై హత్యాకేసు నమోదైంది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీ(AFTC)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏఎఫ్టీసీ క్యాంపస్లోని ఓ గదిలో అంకిత్ ఝా(27) అనే ట్రైనీ క్యాడెట్ ఇటీవల ఉరేసుకుని కనిపించాడు. అతనిపై అప్పటికే కోర్టు విచారణ సాగుతోందని, దీంతో శిక్షణ నుంచీ తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే.. నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు శనివారం స్థానిక ఠాణాలో ఆరుగురు ఎయిర్ఫోర్స్ అధికారులపై ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటనలో ఏఎఫ్టీసీ అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మృతుడి సోదరుడు తన ఫిర్యాదులో ఆరోపించారు. తన సోదరుడికి కాలేజీ క్యాంపస్లో నిత్యం వేధింపులు, చిత్రహింసలు ఎదురయ్యాయని ఆరోపించారు. దీనిపై ఓ సీనియర్ పోలీసు అధికారి స్పందిస్తూ.. ‘ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మృతి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. పోస్ట్మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నాం’ అని ఓ వార్తాసంస్థకు తెలిపారు. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని చెప్పారు. కేసు విచారణలో అన్ని విధాలుగా సహకరిస్తామని వాయుసేన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీవెడ్డింగ్ ఫంక్షన్లో వివాదం..యువకుడిని టెర్రస్పై నుంచి తోసేసిన వ్యాపారవేత్త
ఓ ప్రీవెడ్డింగ్ వేడుకలో సరదాగా గడుపుతున్న సమయంలో యువకుల మధ్య జరిగిన చిన్న వివాదం ఓ వ్యక్తికి ప్రాణాంతకంగా మారింది. -
బాలుడిని చంపేసి.. ఆత్మహత్య చేసుకుని..!
చోరీ చేసి.. డబ్బులు పంచుకునే క్రమంలో జరిగిన గొడవలో ఓ యువకుడు బాలుడిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
హైదరాబాద్లో అమానుషం.. మహిళపై ఇద్దరు యువకుల అత్యాచారం
చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే ఓ మహిళ.. తెల్లవారుజామున ఇద్దరు యువకుల కంటపడింది. కన్నూమిన్నూ కానకుండా వారు ఆమెపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడ్డారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ విద్యార్థుల దుర్మరణం
అమెరికాలో శనివారం రాత్రి(భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం) జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు తెలంగాణ విద్యార్థులను బలిగొంది. -
పవన్ సభలో చాకుతో యువకుడు
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
ట్రక్కును ఢీకొట్టిన కారు.. రాజస్థాన్లో 9 మంది మృతి
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ కారు ట్రక్కును ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. రాజస్థాన్లోని ఝలావాఢ్లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. -
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లా కేస్కుతుల్-కేశముండి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆదివారం ఓ మావోయిస్టు నేత మృతి చెందాడు. -
వార్డు సచివాలయంలో పట్టుబడ్డ మద్యం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వార్డు సచివాలయంలో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. -
చంద్రబాబు సభకు వెళ్లారని హత్యాయత్నం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరులో శనివారం జరిగిన చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడనే అక్కసుతో తెదేపా కార్యకర్తపై వైకాపా మద్దతుదారులు హత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
-
అదరగొట్టిన జియో.. నికర లాభం ₹5,337 కోట్లు
-
కేజ్రీవాల్ ఆరోగ్యం.. మెడికల్ బోర్డు ఏర్పాటుకు కోర్టు ఆదేశం
-
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. ‘పిస్టల్’ కోసం నదిలో గాలింపు
-
వాళ్లతో గొడవ పడటం మంచిది కాదు: పూరి జగన్నాథ్
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా