Crime news : చంబల్ ఎక్స్ప్రెస్ రైల్లోకి పాములు.. ప్రయాణికులు హడల్!
పాములను (Snakes) ఆడించే వ్యక్తులు కొందరు శనివారం రాత్రి చంబల్ ఎక్స్ప్రెస్ రైల్లో (Chambal Express) అలజడి సృష్టించారు. ప్రయాణికులు డబ్బులివ్వలేదనే కారణంతో రైల్లోకి పాములను విడిచిపెట్టారు.
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రం గుండా ప్రయాణం సాగిస్తున్న చంబల్ ఎక్స్ప్రెస్ రైల్లో (Chambal Express) శనివారం రాత్రి కొందరు పాములను (Snakes) విడిచిపెట్టారు. పాములను ఆడించినా ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఇలా చేశారు. దాంతో రైల్లో గందరగోళం నెలకొంది. పాములు కాటు వేస్తాయనే భయంతో కొందరు ప్రయాణికులు పై బెర్తులపైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలోకి దూరి గడియపెట్టుకున్నారు. 30 నిమిషాలపాటు ఈ తతంగం నడిచింది. వివరాల్లోకి వెళితే.. చంబల్ ఎక్స్ప్రెస్ హావ్డా నుంచి గ్వాలియర్ వెళ్తుంది. శనివారం రాత్రి ఆ రైలు మహోబా జిల్లా మలక్పుర గ్రామం వద్దకు రాగానే పాములను ఆడించే నలుగురు వ్యక్తులు ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత వారు బుట్టలో నుంచి పాములను తీసి ఆడించడం మొదలుపెట్టారు. అనంతరం ప్రయాణికులను డబ్బులు అడిగారు. కొందరు ఇవ్వగా.. మరికొందరు నిరాకరించారు. దాంతో పాములను ఆడించే వ్యక్తులకు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కోపోద్రిక్తులైన పాములను ఆడించే వ్యక్తులు బుట్టలు తెరిచి బోగీలో తాము తెచ్చిన పాములను వదిలిపెట్టారు. దాంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయి పై బెర్తులు ఎక్కారు. ఇంకొంత మంది మరుగుదొడ్లలో దూరారు. దాంతో సుమారు అరగంట సేపు రైల్లో భయానక వాతావరణం నెలకొంది.
యువతితో సన్నిహితంగా ఉంటున్నాడని జూనియర్ ఆర్టిస్ట్ హత్య
ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే స్టేషన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాములను ఆడించే వారు అప్రమత్తమై వదిలిపెట్టిన పాములను తిరిగి బంధించారు. ఆ స్టేషన్ రాక ముందే రైలు దిగి పరారయ్యారు. జరిగిన ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ పాముకాటుకు గురికాలేదని ఆయన స్పష్టం చేశారు. బోగీలన్నీ వెతికినా నిందితులెవరూ కనిపించలేదని చెప్పారు. తనిఖీల తర్వాత రైలు గ్వాలియర్ బయలుదేరిందని వెల్లడించారు. రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.