gang-rape: విదేశీటూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం

భారతదేశ గొప్పతనాన్ని, ప్రకృతి అందాలను చూడడానికి భర్తతో పాటు విహార యాత్రకు వచ్చిన ఓ విదేశీయురాలికి ఝార్ఖండ్‌లో చేదు అనుభవం ఎదురైంది.

Published : 02 Mar 2024 14:03 IST

దిల్లీ: తన భర్తతో కలిసి భారతదేశ యాత్రకు వచ్చిన ఓ విదేశీయురాలికి ఝార్ఖండ్‌లో చేదు అనుభవం ఎదురైంది.  దుమ్కా జిల్లాలో భర్తతో కలిసి బైక్‌ టూర్‌కు వచ్చిన స్పెయిన్‌కు చెందిన టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. పోలీసులు వివరాలను వెల్లడించారు.దంపతులు ద్విచక్ర వాహనంపై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకుని బీహార్ మీదుగా నేపాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. 

చీకటి పడడంతో నిర్జన ప్రదేశంలో రాత్రి బస కోసం డేరా ఏర్పాటు చేసుకున్నారు. వీరిని గమనించిన కొందరు వ్యక్తులు వారిపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి ప్రస్తుతం దుమ్కాలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని