తుపాకీతో కాల్చుకొని.. సచిన్‌ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!

స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌కు చెందిన సిబ్బంది ఒకరు ప్రాణాలు తీసుకున్నారు. అతడు సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) రక్షణ వలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 

Updated : 15 May 2024 15:47 IST

ముంబయి: భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar)కు నిత్యం రక్షణగా నిలుస్తున్న ఒక గార్డు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. స్టేట్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్(SRPF) జవాన్‌ అయిన ప్రకాశ్‌ కాప్డే.. సచిన్‌ వీవీఐపీ సెక్యూరిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మహారాష్ట్రలోని జామ్నెర్‌ పట్టణంలోని అతడి స్వస్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

కాప్డే (39) కొన్ని రోజులు సెలవు తీసుకొని తన స్వగ్రామానికి వెళ్లినట్లు ఆ అధికారి తెలిపారు. అక్కడే తన సర్వీస్ తుపాకీతో మెడపై కాల్చుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంట్లోనే అతడు ప్రాణాలు తీసుకున్నట్లు జామ్నర్ పోలీసులు వెల్లడించారు. ‘‘ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చు. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడవుతాయి’’ అని చెప్పారు. అతడికి తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాప్డే వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో.. ఈ ఘటనపై ఎస్ఆర్‌పీఎఫ్‌ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు