Crime News: వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలో ఓ పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది.

Published : 12 Feb 2024 20:48 IST

పటాన్‌చెరు అర్బన్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పరిధిలో ఓ పీజీ వైద్య విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం ఓఆర్‌ఆర్‌పై కారులో విద్యార్థిని అపస్మారకస్థితిలో పడి ఉండగా.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమె పనిచేస్తున్న బాచుపల్లిలోని ప్రైవేటు ఆస్ప్రతికి తరలించారు. సాయంత్రం 4 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. విద్యార్థిని ఇంజెక్షన్‌ తీసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా తమకు ఫిర్యాదు అందలేదని.. అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని