Crime News: హాస్టల్‌లో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Updated : 27 Jan 2024 15:22 IST

మైలవరం: ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో బీటెక్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం వసతి గృహంలో ఉరి వేసుకుని కనిపించడంతో.. మిగతా విద్యార్థినులు వార్డెన్‌కు సమాచారం అందించారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తమ కుమార్తె మరణానికి కారణాలు చెప్పాలంటూ అడ్డుపడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు తన సోదరుడితో సంభాషించినట్లు తోటి విద్యార్థులు పోలీసులకు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ రమేశ్‌, సీఐ కృష్ణ కిశోర్ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని