Tamil Nadu: భార్య ఫిర్యాదు.. మాజీ అదనపు డీజీపీ అరెస్టు
విడిగా ఉంటున్న భార్య ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్న కేసులో తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్ను పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై: తమిళనాడు మాజీ అదనపు డీజీపీ రాజేశ్ దాస్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య బీలా వెంకటేశన్ ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బీలా వెంకటేశన్ ప్రస్తుతం విద్యుత్శాఖ కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఈనెల 18న రాజేశ్ తన అనుచరులతో కలిసి తయూర్ నగర శివారులోని తన ఇంటిలోకి దౌర్జన్యంగా చొరబడ్డారని, కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డును దూషించారని ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయన్ని అరెస్టు చేశారు.
మహిళా ఐపీఎస్పై లైంగిక వేధింపులు.. మాజీ ADGPకి మూడేళ్ల జైలు
కుటుంబ కలహాల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా జీవనం సాగిస్తున్నారు. ఏఐఏడీఎంకే హయాంలో రాజేశ్ దాస్ అదనపు డీజీపీగా సేవలందించారు. ఆ సమయంలో దిగువస్థాయి మహిళా ఐపీఎస్ అధికారిని లైంగికంగా వేధించిన కేసులో గతేడాది విల్లుపురం కోర్టు ఆయన్ని దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం ఆయనకు అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించింది. కాగా, తాజాగా దౌర్జన్యం కేసులో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల