Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
ఎడ్లపందేలకు అనుమతివ్వలేదని కొన్ని అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. జాతీయ రహదారిపైకి చేరుకొని వాహనాలపై రాళ్ల వర్షం కురిపించాయి.
చెన్నై: ఎడ్ల పందేల (Bull Race) నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వలేదని కోపోద్రిక్తులైన అల్లరి మూకలు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రాళ్ల వర్షం (Stones attack) కురిపించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడులోని కృష్ణజిగి-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ జిల్లాలో ఎడ్ల పందేలను నిర్వహిస్తుంటారు. అయితే, ఈ సారి అధికారులు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. దీంతో కొన్ని అల్లరి మూకలు జాతీయ రహదారిపై హల్చల్ చేశాయి. వచ్చిన వాహనాలన్నింటినీ నిలిపేసి..రాళ్లదాడికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టే లాఠీఛార్జి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి జలఫిరంగులు ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఎడ్ల పందేల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, జిల్లా కలెక్టర్ నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు కార్యక్రమానికి అనుమతించలేమని జిల్లా ఎస్పీ సరోజ్ కుమార్ మీడియాకు తెలిపారు. తాజా ఘటనలో కొందరు గాయపడ్డారని, కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పిన ఆయన.. ఈ ఘటనకు కారణమైన వారి కోసం వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
పండగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ‘యెరుతు విదుమ్ విళా’ పేరుతో ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కృష్ణగిరిలో ఉదయం 10 గంటల తర్వాత ఎడ్ల పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా అధికారి ఒకరు చెప్పారు. అయితే, నిర్వాహకులు మాత్రం ఉదయం నుంచే కార్యక్రమం ప్రారంభించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూశాఖ దస్త్రాల దహనం కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. -
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్