Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం
ఎడ్లపందేలకు అనుమతివ్వలేదని కొన్ని అల్లరి మూకలు విధ్వంసం సృష్టించాయి. జాతీయ రహదారిపైకి చేరుకొని వాహనాలపై రాళ్ల వర్షం కురిపించాయి.
చెన్నై: ఎడ్ల పందేల (Bull Race) నిర్వహణకు అధికారులు అనుమతి ఇవ్వలేదని కోపోద్రిక్తులైన అల్లరి మూకలు రోడ్డుపై వెళ్తున్న వాహనాలపై రాళ్ల వర్షం (Stones attack) కురిపించాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం కాగా.. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడులోని కృష్ణజిగి-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణ జిల్లాలో ఎడ్ల పందేలను నిర్వహిస్తుంటారు. అయితే, ఈ సారి అధికారులు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. దీంతో కొన్ని అల్లరి మూకలు జాతీయ రహదారిపై హల్చల్ చేశాయి. వచ్చిన వాహనాలన్నింటినీ నిలిపేసి..రాళ్లదాడికి పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని అల్లరి మూకలను చెదరగొట్టే లాఠీఛార్జి చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి జలఫిరంగులు ఉపయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఎడ్ల పందేల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, జిల్లా కలెక్టర్ నుంచి గానీ స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు కార్యక్రమానికి అనుమతించలేమని జిల్లా ఎస్పీ సరోజ్ కుమార్ మీడియాకు తెలిపారు. తాజా ఘటనలో కొందరు గాయపడ్డారని, కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పిన ఆయన.. ఈ ఘటనకు కారణమైన వారి కోసం వీడియో ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
పండగ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా ‘యెరుతు విదుమ్ విళా’ పేరుతో ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. కృష్ణగిరిలో ఉదయం 10 గంటల తర్వాత ఎడ్ల పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు జిల్లా అధికారి ఒకరు చెప్పారు. అయితే, నిర్వాహకులు మాత్రం ఉదయం నుంచే కార్యక్రమం ప్రారంభించడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్