Road Accident: ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసీ, ఆమె భర్త మృతి
హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా తానేదార్పల్లి ఎంపీటీసీ
హైదరాబాద్: హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా తానేదార్పల్లి ఎంపీటీసీ కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 22న స్వగ్రామంలో వీరి కూతురి వివాహం జరిగింది. ఆ వేడుకలు ముగించుకొని వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్లోని తమ నివాసానికి నిన్న రాత్రి బయల్దేరారు. పెద్ద అంబర్పేట్ వద్దకు రాగానే వేణుగోపాల్ దంపతుల స్కార్పియో వాహనం మలుపు తీసుకుంటున్న టిప్పర్ను వెనక వైపు నుంచి ఢీకొంది. ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
building collapse: కోల్కతాలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఇద్దరు మృతి
building collapse: కోల్కతాలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పది మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో సీఐ కుమారుడి ‘సెల్’చల్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్కు యత్నిస్తూ ఓ అభ్యర్థి చిక్కాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా బేస్తవారపేటకు చెందిన తేళ్ల చిన మల్లయ్య పల్నాడు జిల్లా కారంపూడి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. -
ఇన్స్టాగ్రామ్లో ప్రకటన.. రూ.40 లక్షలు నష్టపోయిన వ్యాపారి
ఇన్స్టాగ్రామ్లో వచ్చిన ప్రకటనను నమ్మిన ఓ వ్యాపారి రూ.40.67 లక్షల మేర మోసపోయారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
చెవి దుద్దులు కొనివ్వలేదని.. భర్తకు నిప్పంటించిన భార్య!
చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమెపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
ఎంపీ కారును ఢీకొని విద్యార్థి దుర్మరణం
తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందారు. -
లారీని ఢీకొని ముగ్గురు కూలీలు దుర్మరణం
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
తేనెటీగల దాడిలో రైతు మృతి
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెం గ్రామానికి చెందిన రైతు పుండ్రు నారాయణరెడ్డి(80) తేనెటీగల దాడిలో మృతిచెందారు. -
పీఎంసీ బ్యాంకును మోసగించిన కేసులో ఆస్తుల జప్తు
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ను మోసగించిన కేసులో హైదరాబాద్ సుల్తాన్బజార్ కింగ్కోఠి రోడ్డులోని హోటల్ వన్కాంటినెంట్కు చెందిన 2-5 అంతస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. -
ఎస్ఐబీలో ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరమేంటి?
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో ఆధారాలను ధ్వంసం చేయాల్సిన అవసరమేంటని ఆ విభాగంలో డీఎస్పీగా పనిచేసిన దుగ్యాల ప్రణీత్రావును హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించారు. అందుకు ఎవరైనా ఆదేశించారా అని ఆరా తీశారు. -
అంజిలప్ప ఇంట్లో అనిశా సోదాలు
గొర్రెల సరఫరా నిధుల మళ్లింపు కేసులో అనిశా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు అంజిలప్ప ఇంటితో పాటు ఇతర ప్రాంతాల్లో రెండు రోజులపాటు సోదాలు నిర్వహించిన అనిశా అధికారులు రూ.9 లక్షల నగదు, అరకిలో బంగారం, బ్యాంక్ లాకర్లలో పలు ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. -
Sangareddy: చేపల కాపలాకు కారులో వస్తే.. దృష్టి మరల్చి ఎత్తుకెళ్లారు!
చెరువులో చేపల కాపలాకు వచ్చిన వ్యక్తిని దృష్టి మరల్చి.. గుర్తుతెలియని దుండగుడు ఆయన కారును ఎత్తుకెళ్లాడు.
తాజా వార్తలు (Latest News)
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ranveer Singh: ‘శక్తిమాన్’గా రణ్వీర్.. రీల్ ‘శక్తిమాన్’ అసహనం
-
TS News: హైదరాబాద్ ప్రజాభవన్లో ‘ప్రజావాణి’కి తాత్కాలిక బ్రేక్
-
KL Rahul: ఐపీఎల్ 2024 సీజన్.. కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై కీలక అప్డేట్
-
Chandrababu: ముస్లింలకు మేలు చేసింది.. చేసేది తెదేపానే: చంద్రబాబు