Crime News: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు యువతి దుర్మరణం

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతిచెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు.

Updated : 27 May 2024 16:28 IST

యాదగిరిగుట్ట: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. మృతురాలిని తెలంగాణకు చెందిన గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదగిరిపల్లె.

గ్రామస్థులు, కుటుంసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సౌమ్య చదువుతో పాటు పార్ట్‌టైం జాబ్‌ కూడా చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న తమ బిడ్డ రోడ్డు ప్రమాదంలో దూరం కావడంపై తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సౌమ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని