Murder: గుమ్మం ముందు చెప్పులు పెడుతున్నాడని చంపేసి...!
క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. గుమ్మం ఎదుట చెప్పులు పెడుతున్నాడని కోపగించిన భార్యాభర్తలు ఓ వ్యక్తిని హత్య చేశారు.
ముంబయి: తమ గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెడుతున్నాడన్న కారణంతో భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. భార్యను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె భర్త పరారీలో ఉన్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని థానే (Thane) జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశం ఎంత నష్టం చేకూరుస్తుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖత్రీ అనే వ్యక్తి నయా నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆ పక్కనే మరో ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇంటి బయట చెప్పులు పెట్టే విషయంలో ఈ రెండు కుటుంబాలకు గత కొన్నాళ్లుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి ఇంటి ముందు మరొకరు చెప్పులు పెట్టుకోవడం.. ఘర్షణ పడటం.. ఇదే తంతు తరచూ నడుస్తోంది.
శనివారం రాత్రి కూడా ఇదే కారణంతో ఇరుకుటుంబాలవారు మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్యభర్తలు కలిసి ఖత్రీని హత్య చేశారు. అనంతరం భర్త అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్టు చేశారు. ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు నయా నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జిలానీ సయ్యద్ వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. హత్యకు చెప్పుల గొడవలే కారణమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్