Murder: గుమ్మం ముందు చెప్పులు పెడుతున్నాడని చంపేసి...!
క్షణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. గుమ్మం ఎదుట చెప్పులు పెడుతున్నాడని కోపగించిన భార్యాభర్తలు ఓ వ్యక్తిని హత్య చేశారు.
ముంబయి: తమ గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెడుతున్నాడన్న కారణంతో భార్యాభర్తలు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. భార్యను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె భర్త పరారీలో ఉన్నాడు. ఈ ఘటన మహారాష్ట్ర (Maharashtra)లోని థానే (Thane) జిల్లాలో చోటు చేసుకుంది. క్షణికావేశం ఎంత నష్టం చేకూరుస్తుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఉదాహరణ. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖత్రీ అనే వ్యక్తి నయా నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆ పక్కనే మరో ఇంట్లో భార్యాభర్తలు ఉంటున్నారు. ఇంటి బయట చెప్పులు పెట్టే విషయంలో ఈ రెండు కుటుంబాలకు గత కొన్నాళ్లుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకరి ఇంటి ముందు మరొకరు చెప్పులు పెట్టుకోవడం.. ఘర్షణ పడటం.. ఇదే తంతు తరచూ నడుస్తోంది.
శనివారం రాత్రి కూడా ఇదే కారణంతో ఇరుకుటుంబాలవారు మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో భార్యభర్తలు కలిసి ఖత్రీని హత్య చేశారు. అనంతరం భర్త అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు భార్యను అరెస్టు చేశారు. ఆమె భర్త కోసం గాలిస్తున్నట్లు నయా నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జిలానీ సయ్యద్ వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. హత్యకు చెప్పుల గొడవలే కారణమా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.2.2 కోట్ల చోరీ కేసు.. గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
రాజమహేంద్రవరంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు చెందిన రూ. 2.2 కోట్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. -
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
గుడుంబా మత్తులో మానవత్వం మరిచిన ఓ జంట కన్నకొడుకు ఛాతీని కొడవలితో కోసిన ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. -
కొల్లగొడుతున్న సైబర్ ముఠాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వ్యాపారి(40) వాట్సప్కు స్టాక్మార్కెట్ మెలకువలు నేర్పిస్తామంటూ మెసేజ్ వచ్చింది. ఆయన ఆసక్తి చూపడంతో ‘ఓక్ట్రీ క్యాపిటల్ గ్రూప్’ పేరిట ఉన్న వాట్సప్ గ్రూప్లో చేర్చారు. నిర్వాహకుల మాటలు నమ్మి వారు సూచించిన బ్యాంకు ఖాతాలోకి వ్యాపారి నగదు బదిలీ చేస్తూ వచ్చారు. -
శిర్డీ ఎక్స్ప్రెస్లో భారీ చోరీ
శిర్డీ ఎక్స్ప్రెస్లో గురువారం అర్ధరాత్రి దాటాక దొంగలు విరుచుకుపడ్డారు. ప్రయాణికుల విలువైన వస్తువులు దోచుకొని పారిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తించిన బాధితులు సికింద్రాబాద్ రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రతికూల వాతావరణంతో యువ సైనికుడి మృతి
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనే ఆ యువకుని తపన ఆదిలోనే ఆవిరైపోయింది. అనారోగ్యం బారినపడటంతో యువసైనికుడు గురువారం రాత్రి మృత్యువాత పడ్డారు. -
గురుకుల విద్యార్థి మృతి
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
న్యాయ విద్య చదువుకొని ఉన్నతంగా జీవించాల్సిన యువ దంపతులు గాడితప్పారు. గంజాయికి బానిసలై.. అడ్డదారులు తొక్కారు. సహచర విద్యార్థి అయిన యువతిని ఆ మత్తు ఊబిలోకి దించారు. -
విద్యార్థి ఉసురు తీసిన నాడు-నేడు పనులు
గత వైకాపా ప్రభుత్వ హయాంలో నాసిరకంగా చేపట్టిన నాడు-నేడు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. లింటెల్, దానిపైన ఉన్న గోడ కూలి మీద పడటంతో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి