Crime News: బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం

హరియాణా నూహ్‌లోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం చోటు చేసుకుంది.

Updated : 18 May 2024 16:17 IST

చండీగఢ్‌: హరియాణా నూహ్‌లోని కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనమయ్యారు. 20 మందికిపైగా తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర నుంచి పంజాబ్‌లోని జలంధర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ఉన్నట్లు సమాచారం. విద్యుదాఘాతం వల్ల బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని